మార్కెట్ ఎటు?
By Sakshi

సోమవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే.. ♦ ఎస్జీఎక్స్ నిఫ్టీ ఫ్లాట్ ఓపెనింగ్ను సూచిస్తోంది. సింగపూర్ ఎక్స్చేంజ్లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:49 సమయంలో 9 పాయింట్ల లాభంతో 10,769 పాయింట్ల వద్ద ఉంది. ♦ ఆసియా మార్కెట్ల ప్రధాన సూచీలన్నీ సోమవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సింగపూర్ ఇండెక్స్ స్ట్రైట్స్ టైమ్స్ 5 పాయింట్ల నష్టంతో 3,040 పాయింట్ల వద్ద, తైవాన్ సూచీ తైవాన్ ఇండెక్స్ 8 పాయింట్ల నష్టంతో 9,638 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్ షాంఘై కంపొసిట్ ఫ్లాట్గా 2,516 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్ కొస్పి 5 పాయింట్ల నష్టంతో 2,056 పాయింట్ల వద్ద, హాంగ్కాంగ్ ఇండెక్స్ హాంగ్ సెంగ్ 181 పాయింట్ల నష్టంతో 25,572 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. కాగా జపాన్ మార్కెట్కు సెలవు. జపాన్ ఇండెక్స్ నికాయ్ 225 శుక్రవారం 226 పాయింట్ల నష్టంతో 20,166 పాయింట్ల వద్ద ముగిసింది. ♦ అమెరికా మార్కెట్లు శుక్రవారం మళ్లీ పతనమయ్యాయి. నాస్డాక్ ఇండెక్స్ దాదాపు 3 శాతం.. డౌజోన్స్ ఇండెక్స్ దాదాపు 2 శాతం, ఎస్అండ్పీ ఇండెక్స్ 2 శాతానికి పైగా నష్టపోయాయి. డౌజోన్స్ ఇండస్ట్రీయల్ యావరేజ్ 1.81 శాతం లేదా 414 పాయింట్ల నష్టంతో 22,445 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్అండ్పీ 500.. 2.06 శాతం లేదా 51 పాయింట్ల నష్టంతో 2,416 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్డాక్ కంపొసిట్ 2.99 శాతం లేదా 195 పాయింట్ల నష్టంతో 6,333 పాయింట్ల వద్ద ముగిసింది. యూరోజోన్లోని అస్థిర పరిస్థితులు, చైనా మందగమనం, వాణిజ్య ఉద్రిక్తతలు, ప్రపంచ వృద్ధి నెమ్మదించడం, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు, అమెరికాలో కార్పొరేట్ ప్రాఫిట్స్ తగ్గడం, అమెరికా ప్రభుత్వ షాట్డౌన్ భయాలు వంటి పలు అంశాలు మార్కెట్పై ప్రతికూల ప్రభావం చూపాయి. ♦ ఇండియన్ రూపాయి శుక్రవారం 48 పైసలు నష్టపోయి, అమెరికా డాలర్తో పోలిస్తే 70.18 వద్ద ముగిసింది. ♦ జీఎస్టీ కౌన్సిల్ శనివారం దాదాపు 23 ప్రొడక్టులపై పన్ను రేట్లు తగ్గించింది. ఇందులో టీవీలు, మూవీ టికెట్లు, సిమెంట్, వాహన విడిభాగాలు వంటివి ఉన్నాయి. ♦ విదేశీ ఇన్వెస్టర్లు డిసెంబర్లో ఇప్పటి దాకా ఇండియన్ క్యాపిటల్ మార్కెట్లలో రూ.4,000 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. రూపాయి బలపడటం, గ్లోబల్గా క్రూడ్ ధరలు తగ్గడం సానుకూల అంశాలు. ♦ ఫెడరల్ చైర్మన్ జెరోమ్ పావెల్ను పదవి నుంచి తప్పించేందుకు తనకు అధికారం ఉందా? అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. క్యాబినెట్ సభ్యులను అడినట్లు అమెరికా మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ♦ బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయా బ్యాంక్, దేనా బ్యాంక్ విలీనం ఈ నెల చిరవకు ఖరారు కావొచ్చని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ♦ ఆర్బీఐ.. డిజిటల్ పబ్లిక్ క్రెడిట్ రిజిస్ట్రీ ఏర్పాటు కోసం ఆరు ఐటీ కంపెనీలను ఎంపిక చేసింది. ఇందులో టీసీఎస్, విప్రో, ఐబీఎం ఇండియా వంటి సంస్థలున్నాయి.
You may be interested
పాజిటివ్ ఓపెనింగ్
Monday 24th December 201810,780 వద్ద నిఫ్టీ ప్రారంభం సెన్సెక్స్ 100 పాయింట్లు అప్ ఇండియన్ స్టాక్ మార్కెట్ సోమవారం లాభాలతో ప్రారంభమైంది. నిఫ్టీ తన మునపటి ముగింపు 10,754 పాయింట్లతో పోలిస్తే 26 పాయింట్ల లాభంతో 10,780 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక సెన్సెక్స్ తన మునపటి ముగింపు 35,742 పాయింట్లతో పోలిస్తే 117 పాయింట్ల లాభంతో 35,859 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. అయితే కొద్దిసేపటి తర్వాత ఇండెక్స లాభాలు తగ్గాయి. ఇండెక్స్లు ఫ్లాట్గా ట్రేడవుతున్నాయి. ఆసియా
స్వల్ప లాభాల్లో ఎస్జీఎక్స్ నిఫ్టీ..
Monday 24th December 2018ఎస్జీఎక్స్ నిఫ్టీ విదేశీ మార్కెట్లో సోమవారం స్వల్ప లాభాలతో ట్రేడవుతోంది. సింగపూర్ ఎక్స్చేంజ్లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 8:49 సమయంలో 9 పాయింట్ల లాభంతో 10,769 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్ శుక్రవారం ముగింపు స్థాయి 10,767 పాయింట్లతో పోలిస్తే 2 పాయింట్ల లాభంతో ఉందని గమనించాలి. అందువల్ల నిఫ్టీ సోమవారం ఫ్లాట్గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి.